Ticker

6/recent/ticker-posts

సొంతబిడ్డ కన్నా మిన్నగా చూసుకోవాలి: జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్

 

ఏలూరు జిల్లా ఏలూరు: దత్తత తీసుకున్న చిన్నారిని సొంతబిడ్డ కన్నా మిన్నగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సూచించారు. స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సమక్షంలో మహిళా శిశు సంక్షేమ అధికారులు బేబి వివ్యబాల అనే 7 నెలలు వయస్సు గల పాపను తమిళనాడు రాష్ట్రానికి చెందిన దత్తత అర్జీదారులు లింగదొరై, జయంతిలకు దత్తత ఇవ్వడమైంది.


ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ చిన్నారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.  దత్తత అర్జీదారులు 2019వ సంవత్సరంలో బాలిక శిశువు కొరకు ధరఖాస్తు పెట్టుకోగా ఈ రోజున వారు బేబి వివ్యబాలను దత్తత పొందారు. లింగదొరై టి.వి. సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా జయంతి హోటల్ బిజినెస్ నిర్వహిస్తున్నారు.  


ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారాతధికారి, కె. పద్మావతి, డిసిపిఓ సిహెచ్. సూర్య చక్ర వేణి, బాలల రక్షణాధికారి ఆర్. రాజేష్, అవుట్ రీచ్ వర్కర్ కె.భార్గవి పాల్గొన్నారు.