పని చూసుకొని తిరిగి వేరే రైలు ఎక్కి వెళ్ళదామని అనుకున్నాడు. వారిని ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చేసాడు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ నుంచి బయల్దేరిన అరగంట వ్యవధిలోనే ట్రైన్ ప్రమాదానికి గురైందని వార్త వినిపించ్చింది. ఈ వార్త అందిన వెంటనే.. ఆందోళనకు గురైన గౌతమ్ దాస్ బంధువుల సాయంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఛిన్నాభిన్నమైన బోగీల మధ్య తమవాళ్లు ఉన్నారేమోననే ఆందోళనతో వెతికాడు.
అతని అనుమానమే నిజమైంది. అతని భార్య విష్ణుప్రియ, అత్త, బావమరిది ముగ్గురూ మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న గౌతం దాస్.. ఆదివారం వారికి అంత్యక్రియలు జరిపించాడు. పెళ్లైన ఏడాదికే భార్యను కోల్పోయిన గౌతమ్ దాస్ రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
ఒడిశా రైలు ప్రమాదంలో వెలుగులోకి వస్తున్న ఇలాంటి కన్నీటి కథలెన్నో.. ఇప్పుడు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 280 మంది మృతి చెందారు. 1080 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు.. తమిళనాడుకు చెందిన ఆరుగురు ప్రయాణికుల జాడ ఇప్పటికీ తెలియరాలేదు. వారు బతికున్నారా? లేదా? అనే విషయంపై నేటికీ స్పష్టత లేదు. బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.
01) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో గెలిచేది ఏవరు?
మీ అభిప్రాయాన్ని ఓటు గుర్తు పై క్లిక్ చేసి ఆప్షన్స్ ఎంచుకోండి.. సీక్రెట్ ఓటింగ్ చేయండి.